Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై కేంద్ర బృందానికి సీఎం రిక్వెస్ట్

Revanth Reddy: రాష్ట్రంలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోండి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Sept 2024 3:15 PM IST
CM request to central team on flood damage in Telangana
X

Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై కేంద్ర బృందానికి సీఎం రిక్వెస్ట్

Revanth Reddy: తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు. వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్నేరు వాగుకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story