యాదాద్రిలో సీఎం కేసీఆర్‌.. బాలాలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

యాదాద్రిలో సీఎం కేసీఆర్‌.. బాలాలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు
x
Highlights

యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. కేసీఆర్‌ రోడ్డు మార్గాన యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ సీఎం కేసీఆర్‌కు మంత్రి జగదీశ్‌ రెడ్డి,...

యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. కేసీఆర్‌ రోడ్డు మార్గాన యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ సీఎం కేసీఆర్‌కు మంత్రి జగదీశ్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

యాదాద్రి ఆలయ నిర్మాణపనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అలాగే ప్రెసిడెన్షియల్ సూట్, ఇతర కాటేజ్ నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి సీఎం కేసీఆర్‌కు నిర్మాణ పనులు వివరాలు తెలియజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories