త్వరలో విద్యుత్ వారం..కరెంటు బిల్లు చెల్లించకపోతే వేటు తప్పదు
విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో...
విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో విద్యుత్ శాఖ పనితీరు బాగుందని ప్రశంసించారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై సమీక్షించారు.
విద్యుత్ శాఖపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన విద్యుత్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కనురెప్పపాటు కూడా కరెంటు పోవద్దు, విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు పడొద్దు అనే విధానం తమదని చెప్పారు. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు ఇకపై ప్రతీ నెలా విద్యుత్ బిల్లులు చెల్లించేలా కఠినమైన విధానం అవలంభిస్తామని వెల్లడించారు. విద్యుత్ కు సంబంధమైన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి గ్రామాలు, పట్టణాల్లో త్వరలోనే 'పవర్ వీక్' నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎత్తిపోతల పథకాలకు ఏ సమయంలో ఎంత విద్యుత్ అవసరం? దాన్ని ఎలా సమకూర్చాలి? అనే విషయంపై నీటి పారుదల, విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై సరైన అంచనాలతో ముందుకుపోవాలని సిఎం చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏర్పడిన డిమాండును తట్టుకునేందుకు, తక్కువ ధరకు లభ్యమయ్యే సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి, ప్రస్తుతం వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖకు ఎప్పుడు అవసరం ఏర్పడినా తీర్చగలిగే ఆర్థిక విధానం రూపొందించాలని ఆర్థిక శాఖను కోరారు.
ఇకపై ప్రభుత్వ శాఖల బిల్లులను ఆయా శాఖలకు కేటాయించే బడ్జెట్ నుంచి ఆర్థిక శాఖే నేరుగా చెల్లిస్తుందన్నారు సిఎం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వాడే విద్యుత్ కోసం ప్రీ పెయిడ్ మీటర్లను అమర్చాలని సూచించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందివ్వడానికి, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ఇందుకోసం బడ్జెట్లోనే ప్రత్యేక గ్రాంటు కేటాయించి, ప్రతీ నెలా విధిగా విద్యుత్ సంస్థలకు అందిస్తుందన్నారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు పెద్ద మొత్తంలో విద్యుత్ బకాయిలు ఉండటం. వాటి బిల్లులు చెల్లించకోవడం దారుణమన్నారు సిఎం సకాలంలో కరెంటు బిల్లు కట్టకపోతే గ్రామాల్లో అయితే సర్పంచ్, గ్రామ కార్యదర్శి, మున్సిపాలిటీ అయితే చైర్ పర్సన్, కమిషనర్లపై వేటు తప్పదని హెచ్చరించారు. ఇంతకుముందు పేరుకుపోయిన పాత బకాయిలను ఒన్ టైమ్ సెటిల్మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. విద్యుత్ సంస్థల బకాయిలను జీరో సైజుకు తీసుకు వస్తామని చెప్పారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తక్షణం చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. 60 రోజుల పాటు అమలయ్యే కార్యాచరణలో ఏడు రోజుల పాటు 'పవర్ వీక్' కూడా ఉంటుందని ఆ సమయంలో వంగిన పోళ్లను సరిచేయడం, ఒరిగిన లైన్లను సరిచేయడం, బిల్లులు పెండింగులో లేకుండా చేయడం తదితర పనులను నిర్వహిస్తామన్నారు సీఎం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire