విధుల్లోకి హాజరుకాని వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదు : కేసీఆర్

విధుల్లోకి హాజరుకాని వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదు : కేసీఆర్
x
Highlights

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకుపోవాలని, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవని అన్నారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లోకి చేరని వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని ఆయన సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories