ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో క్లూస్‌ టీమ్‌ తనిఖీలు.. బుల్లెట్ల కోసం..

ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో క్లూస్‌ టీమ్‌ తనిఖీలు.. బుల్లెట్ల కోసం..
x
క్లూస్‌ టీమ్‌
Highlights

షాద్‌నగర్‌ చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో పోలీసలు తనిఖీలు చేస్తున్నారు. నిందితుల శరీరం నుండి బయటపడ్డ బుల్లెట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు....

షాద్‌నగర్‌ చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ప్రాంతంలో పోలీసలు తనిఖీలు చేస్తున్నారు. నిందితుల శరీరం నుండి బయటపడ్డ బుల్లెట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డీప్‌మెటల్‌ డిటెక్టర్‌తో బాంబ్‌ స్వ్కాడ్‌ టీమ్‌ తనిఖీలు చేస్తోంది. అయితే రాత్రి నుండి ఘటనా స్థలంలో బుల్లెట్ల కోసం టెక్నికల్‌ టీమ్‌ సెర్చ్‌ చేస్తోంది. ఇప్పటికే పోలీసులు కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇవాళ మహబూబ్‌నగర్‌కు NHRC ప్రతినిధుల బృందం రానుంది. మృతదేహాలను NHRC బృందం పరిశీలించిన తర్వాతే అంత్యక్రియలు జరగునున్నాయి. సోమవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం వెళ్లనుంది. ఎన్‌కౌంటర్‌ చెందిన మృతుల నిందితుల మృతదేహాలను పరిశీలింస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories