ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతున్నారు : భట్టి విక్రమార్క

ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతున్నారు : భట్టి విక్రమార్క
x
Highlights

ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్‌ బండ్‌ పిలుపుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వ తీరు అత్యంత ప్రమాదకరంగా...

ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్‌ బండ్‌ పిలుపుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వ తీరు అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు. సమ్మెను ఆసరాగా చేసుకుని ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతున్నారని, రూట్లను ప్రైవేటీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆస్తులను ప్రభుత్వం ప్రజల కోసం సృష్టించాలి కానీ, ఈ ప్రభుత్వం ఆస్తులను అమ్ముతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగం, న్యాయస్థానాలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా శాసనసభకు, హైకోర్టుకు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు భట్టి విక్రమార్క.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories