పెళ్లి వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తున్నవారి మీదకు దూసుకెళ్లిన కారు.. 13 ఏళ్ల బాలుడు మృతి

Car Crashed over Dancing People in Marriage Baraat in Nalgonda | Live News Today
x

పెళ్లి వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తున్నవారి మీదకు దూసుకెళ్లిన కారు.. 13 ఏళ్ల బాలుడు మృతి

Highlights

Nalgonda: డ్రైవింగ్ రాకపోయినా కారు నడిపేందుకు ప్రయత్నించిన పెళ్లికొడుకు

Nalgonda: నల్గొండ జిల్లా చండూర్ మండలం గట్టుప్పల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గట్టుప్పల్ కు చెందిన మల్లేష్ వివాహం యదాద్రి జిల్లా నారాయణపురంలో జరిగింది. పెళ్లి వేడుక ముగించుకొని వధూవరులు గట్టుప్పల్ కి రాత్రి సమయంలో కారులో వచ్చారు. డీజే పాటలతో బారాత్ ఏర్పాటు చేశారు. కొద్ది దూరంలో ఇంటికి చేరుకోబోతుండగా.. బంధువులు, స్నేహితులు జోరుగా డ్యాన్స్ చేస్తున్న క్రమంలో.. కారు డ్రైవర్ కారు నుండి దిగి పక్కకు వెళ్లాడు.

ఆ సమయంలో వరుడు డ్రైవింగ్ రాకున్నా కారు నడిపే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా ముందు డ్యాన్స్ చేస్తున్నవారి పైకి కారు దూసుకెళ్లింది. ఎదురుగా ఉన్న డీజే బాక్సులను, ట్రాక్టర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో దుబ్బాక సాయి చరణ్ అనే 13 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. పెళ్లి కొడుకు సహా మరికొందరికి గాయాలయ్యాయి. అప్పటివరకు పెళ్లి వేడుకతో సంతోషంగా ఉన్న ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories