Madhira: మిషన్ ఇంద్ర ధనస్సుపై కళాకారుల ప్రచారం

Madhira: మిషన్ ఇంద్ర ధనస్సుపై కళాకారుల ప్రచారం
x
Highlights

రీజనల్ అవుట్రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా కోలాట బృందం టీమ్ లీడర్ రేవూరి దశరథ కళా బృందం కళాకారుల చేత... మిషన్ ఇంద్ర ధనస్సు టీకాల అవగాహన కార్యక్రమం

మధిర: రీజనల్ అవుట్రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా కోలాట బృందం టీమ్ లీడర్ రేవూరి దశరథ కళా బృందం కళాకారుల చేత... మిషన్ ఇంద్ర ధనస్సు టీకాల అవగాహన కార్యక్రమం శనివారం నిదానపురం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాటలు, నాటికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డ నుండి అయిదు సంవత్సరాల పిల్లల వరకు ఎన్ని రకాల టీకాలు వేయించుకోవాలి... ఏ టైంలో వేయించుకోవాలో ప్రజలకు వివరించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే టీకాలు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీనివాస్, సూపర్ వైజర్ మర్యరాణి, ఏఎన్ఎంలు మరియమ్మ, రాజ్యలక్ష్మి, పద్మావతి, కళాబృందం సభ్యులు వేణు, నాగేశ్వరరావు, జయమ్మ, మల్లేశ్వరి, నాగమ్మ, ధనలక్ష్మి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories