TS News: బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం.. ఇవాళ చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ

BRS Praja Ashirvada Sabha In Chevella Today
x

TS News: బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం.. ఇవాళ చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ

Highlights

TS News: ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్

TS News: బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సర్వం సిద్ధం అయ్యింది. ఇవాళ చేవెళ్లలో ప్రజాఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ సభలో ప్రసంగించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభ కావడంతో పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు రెండు లక్షల మందిని సభకు తరలించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతో పాటు దూరం నుంచి సభను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక స్ర్కీన్లు ఏర్పాటు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంతో ఉన్న బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో జోష్ నింపేలా.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు ప్రచార వ్యూహానికి ప్రణాళికలు రచిస్తున్నారు. చేవెళ్ల బహిరంగ సభ వేదికగా కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల నల్లగొండ, కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభల్లో రైతాంగ సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగట్టిన కేసీఆర్.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలపై మరోసారి ప్రజలకు వివరించేలా ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు, మూడు బహిరంగ సభలు నిర్వహించాలా.. లేక బస్సు యాత్ర చేపట్టాలా అన్న అంశంపై గులాబీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories