Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో ఇవాళ బోధన్‌ బీఆర్‌ఎస్‌ బూత్‌స్థాయి సమావేశం.. హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత

Nizamabad: ఏఆర్‌ఆర్‌ గార్డెన్‌ నుంచి ఎన్‌ఎస్‌ఎఫ్‌ గ్రౌండ్‌ వరకు పాదయాత్ర

Shekhar G
Published on: 16 Aug 2023 9:29 AM IST
Bodhan BRS Booth Level Meeting In Nizamabad District Today
X

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో ఇవాళ బోధన్‌ బీఆర్‌ఎస్‌ బూత్‌స్థాయి సమావేశం.. హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత

Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ BRS బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే షకీల్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. అంతకుముందు బోధన్ ఏఆర్ఆర్ గార్డెన్ నుంచి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ పాదయాత్రగా వచ్చి కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. బోధన్ నియోజకవర్గానికి చెందిన 10వేల మంది కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాటు చేశారు. ఇందు కోసం బోధన్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయగా, ఏర్పాట్లను ఎమ్మెల్యే షకీల్ పర్యవేక్షించారు. సమావేశం అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Shekhar G

Shekhar G

Next Story