టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ సమితి : జేపీ నడ్డా

BJP National President JP Nadda Comments on CM KCR
x

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ సమితి : జేపీ నడ్డా

Highlights

అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ సర్కార్ : జేపీ నడ్డా

Mahabubnagar: డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ కు అభివృద్దిలో రెట్టింపు ప్రయోజనం కలుగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. టీఆర్ఎస్ ను తెలంగాణ రజాకార్ సమితి గా అభివర్ణించారు. పాలమూరులో జరిగిన ప్రజాసంగ్రామసభలో పాల్గొన్న నడ్డా కేంద్రం ఇస్తున్న నిధులతో కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టి తెలంగాణ లో పథకాలకు పేర్లు పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేసారు.

తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. పాలమూరులో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దుబ్బాకలో ధమాకా, హుజూరాబాద్ లో ఎదురుదెబ్బలు తెలంగాణ లో టీఆర్ఎస్ కు గుణపాఠం లాంటివన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎం లా మారిందని.. అత్యంత అవినీతి సర్కారు కేసీఆర్ సర్కార్ అని విమర్శించారు. టీఆర్ఎస్ తెలంగాణ రజాకార్ సమితి గా అభివర్ణించిన నడ్డా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ కు అభివృద్దిలో రెట్టింపు ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి తెలంగాణలో కాపీ కొడుతున్నారని జేపీ నడ్డా విమర్శించారు.

అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 22 వ రోజు పాలమూరు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఎం.వీ.ఎస్ కాలేజీ గ్రౌండ్ లో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగించారు. పాలమూరులో వలసలు లేవని అంటున్న సీఎం కు వలసలున్నాయని నిరూపించేందుకు సిద్దంగా ఉన్నామని, తన సవాల్ ను స్వీకరించాలన్నారు. తన మాట నిజమైతే కేసీఆర్, అతని కుటుంబం తెలంగాణ ను వదిలి వెళ్లిపోవాలన్నారు. వలసలు లేవని నిరూపిస్తే తను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ సవాల్ విసిరారు.

పాలమూరులో జరిగిన బహిరంగసభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావు, ఎంపీలు సోయం బాపురావు, అర్వింద్ , మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. సభ అనంతరం వేదికపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తోపాటు కార్యకర్తలు స్టెప్పు లేసారు.


Show Full Article
Print Article
Next Story
More Stories