ఇంటర్‌ పోరు.. 2న తెలంగాణ బంద్‌

ఇంటర్‌ పోరు.. 2న తెలంగాణ బంద్‌
x
Highlights

ఇంటర్ బోర్డు నిర్వాకానికి ఎందరో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మే 2న తెలంగాణ బంద్‌కు...

ఇంటర్ బోర్డు నిర్వాకానికి ఎందరో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మే 2న తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ట్యాంక్‌బండ్‌ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..

ఇంటర్ విద్యార్థులకు న్యాయం చెయ్యడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. దీంతో ఆవేశానికి లోనైనా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు తద్వారా తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతున్నారని అన్నారు. ఇంటర్‌ అవకతవకలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా మే 2న తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువస్తామని తెలిపారు. ఇంటర్‌ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories