ఆర్టీసీ కార్మికులను తొలగిస్తే.. ప్రభుత్వాన్ని ప్రజలు కూలుస్తారు: లక్ష్మణ్‌

ఆర్టీసీ కార్మికులను తొలగిస్తే.. ప్రభుత్వాన్ని ప్రజలు కూలుస్తారు: లక్ష్మణ్‌
x
Highlights

విధుల్లో చేరని ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను బీజేపీ ఖండించింది. ముఖ్యమంత్రి నిర్ణయం ఉద్యోగులను రెచ్చగొట్టేవిధంగా...

విధుల్లో చేరని ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను బీజేపీ ఖండించింది. ముఖ్యమంత్రి నిర్ణయం ఉద్యోగులను రెచ్చగొట్టేవిధంగా ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ‌్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షం నిర్ణయం తీసుకునే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదన్నారు. కార్మికులను తొలగిస్తే.. ప్రభుత్వాన్ని ప్రజలు కూలుస్తారని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలను పండుగ రోజున రోడ్లపైకి లాగడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపును తక్షణం ఉపసంహరించుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని లక్ష్మణ్ హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories