Bandi Sanjay: కేంద్రాన్ని, బీజేపీని తిట్టడానికే టీఆర్‌ఎస్ ప్లీనరీ

BJP Chief Bandi Sanjay Comments on TRS Plenary | Telugu News
x

Bandi Sanjay: కేంద్రాన్ని, బీజేపీని తిట్టడానికే టీఆర్‌ఎస్ ప్లీనరీ

Highlights

Bandi Sanjay: ప్లీనరీలో పార్టీ సంస్థాగత అంశాలు, హామీలపై చర్చే లేదు

Bandi Sanjay: కేంద్రాన్ని, బీజేపీని తిట్టడానికే టీఆర్‌ఎస్ ప్లీనరీ పెట్టారని టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నంలో భాగమేనన్నారు. ప్లీనరీలో పార్టీ సంస్థాగత అంశాలు, హామీలపై చర్చే లేదని చెప్పారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవని ఈ పరిస్థితికి కారణం ఎవరని బండి సంజయ్ ప్రశ్నించారు. తాను చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర చూసి భయపడుతున్నారని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories