నిజామాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
* డిచ్పల్లి మండలం యానంపల్లిలో 200 కోళ్లు మృతి * బర్డ్ ఫ్లూగా అనుమానిస్తున్న గ్రామస్తులు * పశు సంవర్ధకశాఖ అధికారులకు సమాచారం
Representational Image
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. యానపల్లితండా సమీపంలోని ఓ పౌల్ట్రీఫాంలో 2వందల కోళ్లు చనిపోయాయి. దీంతో గ్రామస్తులు బర్డ్ ఫ్లూగా అనుమానిస్తున్నారు. వెంటనే గ్రామస్తులు పశు సంవర్ధకశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వారు వెంటనే గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇక నిర్వాహకులు చనిపోయిన కోళ్లను గుంత తీసి పూడ్చిపెట్టారు.
Next Story




