దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయం : బండి సంజయ్‌

దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయం : బండి సంజయ్‌
x
Highlights

దుబ్బాకలో భారీ పోలింగ్ శాతం నమోదైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు గుర్తించారని తెలిపారు.

దుబ్బాకలో భారీ పోలింగ్ శాతం నమోదైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు గుర్తించారని తెలిపారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్‌ అసత్య ప్రచారం చేసిందన్న బండి సంజయ్.... కేసీఆర్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు గుర్తించి బీజేపీకి ఓటు వేశారని తెలిపారు.

దుబ్బాక ‎ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6గంటల్లోపు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలైన్లో నిల్చున్నవారికి మాత్రమే ఓటేసే అవకాశం కల్పించనున్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా మొదట పోలింగ్ మందకొడిగా సాగినప్పటికీ ఓటింగ్ పర్సంటేజ్‌ మాత్రం ఈజీగా 80శాతం దాటేసింది. ముఖ్యంగా చివరి రెండు గంటల్లో పోలింగ్ పర్సంటేజ్ భారీగా నమోదైనట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories