దిశ నిందితుల మృతదేహాలకు మొదలైన రీపోస్ట్‌మార్టం

దిశ నిందితుల మృతదేహాలకు మొదలైన రీపోస్ట్‌మార్టం
x
Highlights

దిశ నిందితుల డెడ్ మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం మొదలైంది. రీపోస్ట్‌మార్టం చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్‌ నుండి ఫోరెన్సిక్‌ నిపుణులు గాంధీ ఆస్పత్రికి...

దిశ నిందితుల డెడ్ మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం మొదలైంది. రీపోస్ట్‌మార్టం చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్‌ నుండి ఫోరెన్సిక్‌ నిపుణులు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఫోరెన్సిక్‌ బృందంతో పాటు రీపోస్ట్‌మార్టంలో గాంధీ సూపరింటెండెంట్ పాల్గొననున్నారు. ఈ రీపోస్ట్‌మార్టం మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయనున్నారు. రీపోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత షీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే నిందితుల కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. రీపోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను గాంధీ వైద్యుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories