ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లోని లైట్లు అన్నీ ఆర్పేసి, ఇంటి ఆవరణలో దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని, టార్చ్లైట్,...
ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లోని లైట్లు అన్నీ ఆర్పేసి, ఇంటి ఆవరణలో దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని, టార్చ్లైట్, స్మార్ట్ఫోన్ ఫ్లాష్ ఆన్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. దేశ ప్రజల జీవితాలను 9 నిమిషాలకు కుదించివేస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు. ఈ దేశం ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ కాదంటూ ట్వీట్ చేశారు. ఈ దేశ ప్రజలకు ఎన్నో ఆశయాలు ఉన్నాయి వాళ్లు తమ భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్నారు...అలాంటి వారిని మీ జిమ్మిక్కులతో మోసం చేయవద్దంటూ అసద్ ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రకటనలు కాకుండా ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి ఎంత సాయం చేశారో.. చెప్పాలని డిమాండ్ చేశారు.
"ఈ ట్యూబ్ లైట్ ఐడియా ఎక్కడా కనలేదు, వినలేదు. దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఆకలితో అలమటిస్తూ, గూడు లేక కాలినడకన ఇళ్లకు పయనమయ్యారు. ప్రధాని గారూ, ఎక్కడుంది మీరు చెబుతున్న వెలుగు? వలస కార్మికుల ద్వారా కరోనా ఇన్ఫెక్షన్లు మరింత ప్రబలమవుతాయని మీ లాయర్లు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. కానీ మీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ భారత్ లో సామాజిక సంక్రమణం ద్వారా కరోనా వైరస్ వ్యాపించడం తక్కువేనని చెబుతోంది. ఆర్థికసాయం అందించాలని సీఎంలు కోరుతుంటే లైట్లు ఆర్పేయాలని చెబుతారా?" అంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
This country is not an event management company. The people of India are humans who too have dreams & hopes. Don't reduce our lives to gimmicks of 9 mins, @PMOIndia. We wanted to know what aid states will get & what relief the poor will receive
— Asaduddin Owaisi (@asadowaisi) April 3, 2020
Instead we got some new drama[1/n]
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire