రాష్ట్రంలో లక్షా 17వేలపైగా పోస్టులు భర్తీ చేశాం : మంత్రి హరీశ్ రావు

రాష్ట్రంలో లక్షా 17వేలపైగా పోస్టులు భర్తీ చేశాం : మంత్రి హరీశ్ రావు
x
Highlights

మిషన్‌కాకతీయకు కేంద్ర ఎలాంటి సాయంచేయలేదని..,పునరుద్దరించిన చెరువులతో 14లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరిచ్చామని అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం లక్షా 17వేల 714పోస్టులు భర్తీ చేశాం. మరో 31,668 పోస్టుల నియామకాల ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు.

తెలంగాణ శాసనసభాసమావేశాలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని సభ్యులు వినియోగించుకుంటున్నారు. వారి ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. మిషన్‌కాకతీయ లేవనెత్తిన ప్రశ్నకు.. మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. మిషన్‌కాకతీయకు కేంద్ర ఎలాంటి సాయం చేయలేదన్నారు. మిషన్ కాకతీయ పథకంలో పునరుద్దరించిన చెరువులతో 14లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరిచ్చినమన్నారు. మిషన్‌కాకతీయపై నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఛానల్‌ డాక్యుమెంటరీ రూపొందించిందని చెప్పారు. మిషన్‌కాకతీయ పథకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసుకుంటున్నమని హరీశ్‌రావు వెల్లడించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ నియామకాలు భర్తీకి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బాల్కాసుమన్ అడిగిన ప్రశ్నకు హరీశ్ రావు సమాదానం ఇచ్చారు.., తెలంగాణ ఏర్పాటు అనంతరం లక్షా 17వేల 714పోస్టులు భర్తీ చేశాం. మరో 31,668 పోస్టుల నియామకాల ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి 900 కేసులు కోర్టుల్లో ఉన్నాయని హరీశ్‌రావు వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories