సమత కేసులో కాసేపట్లో తుది తీర్పు.. జడ్డి ముందు కన్నీటి పర్యంతమైన నిందుతులు

సమత కేసులో కాసేపట్లో తుది తీర్పు.. జడ్డి ముందు కన్నీటి పర్యంతమైన నిందుతులు
x
Highlights

సమత కేసులో ప్రత్యేక కోర్టు కాసేపట్లో తుది తీర్పును వెలువరించనుంది. సమత కేసులోని నిందుతులు ముగ్గురు, జడ్డి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తుది తీర్పుకు...

సమత కేసులో ప్రత్యేక కోర్టు కాసేపట్లో తుది తీర్పును వెలువరించనుంది. సమత కేసులోని నిందుతులు ముగ్గురు, జడ్డి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. తుది తీర్పుకు ముందు నిందితులు కేసుపై జడ్జికి వివరణ ఇచ్చారు. జడ్జి, నిందితుల కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమకు పిల్లలు ఉన్నారని శిక్ష తగ్గించాలని నిందితులు, న్యాయమూర్తికి తెలిపారు. దీనిపై స్పందించిన జడ్జి నేరం రుజువయ్యిందని నిందితులకు తెలిపారు.

కోర్టు తీర్పు నేపథ్యంలో సమత కుటుంబ సభ్యులలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సమత భర్త కోర్టుకు హాజరయ్యారు. అత్యాచారం చేసి, హత్య చేసిన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అత్యంత కిరాతకంగా హత్యచేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలన్నారు. సమతను కోల్పోవడంతో తాను, తన ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories