సెలబ్రిటీల ట్వీట్లను బీట్ చేసిన ఓ అమ్మాయి ట్వీట్.. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది?

సెలబ్రిటీల ట్వీట్లను బీట్ చేసిన ఓ అమ్మాయి ట్వీట్.. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది?
x
సెలబ్రిటీల ట్వీట్లను బీట్ చేసిన ఓ అమ్మాయి ట్వీట్.. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముంది?
Highlights

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ని షేక్ చేసిన న్యూస్ అది, హేమా హేమీలు సెలబ్రిటీల ట్వీట్లకు మించి రెస్పాన్స్ వచ్చిన ట్వీట్ అది. అది సాదా సీదా న్యూస్ కాదు,...

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ని షేక్ చేసిన న్యూస్ అది, హేమా హేమీలు సెలబ్రిటీల ట్వీట్లకు మించి రెస్పాన్స్ వచ్చిన ట్వీట్ అది. అది సాదా సీదా న్యూస్ కాదు, అలాగని కొత్త వార్తా కాదు, మనం ప్రతీరోజు అనుభవిస్తున్న ఆవేదనే, మన దైనందిన జీవితంలో ఇబ్బందులు కలిగిస్తున్న అంశమే. ఓ అమ్మాయి తన ఆవేదనను పంచుకున్న ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి కలకలం సృష్టిస్తోంది ఇంతకీ ఏంటా న్యూస్.

సోషల్ మీడియా ఇవాళ వేగంగా విస్తరిస్తున్న మాధ్యమం. ఏ సమస్యకైనా ప్రభుత్వాల చుట్టూ తిరగడం కన్నా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా ఓ ట్వీట్ చేస్తే చాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. నగరంలో ఏళ్ల తరబడి నలుగుతున్నరోడ్ల అధ్వాన్నపు స్థితిపై విసిగిపోయిన ఓ యువతి నగర రోడ్లపై ఓ ట్వీట్ చేసింది ఆ ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. సెలబ్రిటీలను మించిపోయి సెన్సేషన్ అవుతోంది నగర రోడ్ల దుస్థితిపై దీప్తీ దుగ్గిరాల. చేసిన ఆ ట్వీట్ నెటిజెన్లకు హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిపై ఓ యువతి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విశ్వనగరమని చెప్పుకుంటున్న హైదరాబాద్‌‌లో అధ్వాన్నమైన రోడ్లకు అద్దం పడుతున్న యువతి ట్వీట్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఆ యువతి ట్వీట్‌‌లో ఏముందో ఒకసారి చూద్దాం.

హైదరాబాద్ బాచుపల్లిలో నివాసముండే దీప్తి దుగ్గిరాల తన తండ్రికి జరిగిన రోడ్డుప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ ట్వీట్ చేసింది. బాచుపల్లి ప్రధాన రహదారిపై గుంతల కారణంగా తన తండ్రి ప్రమాదానికి గురయ్యాడని ఆయన ప్రయాణిస్తున్న టూవీలర్ గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. రక్తమోడుతూ ఇంటికొచ్చిన తన తండ్రిని చూసి తట్టుకోలేకపోయానంటూ ట్వీట్ చేసింది.

అయితే, హైదరాబాద్‌ బాచుపల్లిలో రోడ్ల దుస్థితిపై దీప్తి దుగ్గిరాల చేసిన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయ్యింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ట్యాగ్ చేస్తూ దీప్తి చేసిన ట్వీట్‌‌ను పలువురు రీట్వీట్ చేశారు. హైదరాబాద్లో రోడ్ల దుస్థితిపై హాట్ కామెంట్స్ చేశారు. అయితే, దీప్తి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ నెటిజన్‌ శ్రీని పోస్ట్ చేసిన ఫొటో మరింత వైరల్‌గా మారింది. ప్రభుత్వ పెద్దలు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ హైదరాబాద్‌ రోడ్లను అందమైన చందమామలా మార్చేశారని కామెంట్ చేశాడు. అయితే, హైదరాబాద్ రోడ్లను చంద్రుడిపై ఉండే లోయలతో పోలుస్తూ ఫొటో ట్వీట్ చేశారు.

హైదరాబాద్‌లోనే కాదు బెంగళూరులోనూ ఓ పౌరుడు గుంతలమయమైన రోడ్లపై తన ఆవేదన వ్యక్తంచేస్తూ మూన్‌ వాక్‌తో నిరసన తెలిపాడు. రహదారుల దుస్థితి ఇక్కడే కాదు బెంగళూరులోనూ గతంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వాలు రోడ్లు వేయడం. అవి ఓ ఎండకో వానకో కొట్టుకు పోవడం మామూలే గుంతల రోడ్లపై ప్రయాణాలు నరకప్రాయం బెంగళూరులో రోడ్లు కూడా ఇందుకేమీ తీసిపోవు గతంలో బెంగళూరు రోడ్ల దుస్థితిని వర్ణించడానికి అక్కడి సిటిజన్ ఒకరు నడిరోడ్డుపై చంద్రమండలంతో పోల్చారు చంద్రుడిపై ఆస్ట్రోనాట్ లా వాకింగ్ చేసి చూపించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories