Mahabubabad: రోడ్డుపక్క పొదల్లోకి దూసుకువెళ్లిన స్కూలు బస్సు.. భయంతో కేకలు వేసిన విద్యార్థులు

A School Bus Rammed into the Bushes on the Roadside in Mahabubabad
x

Mahabubabad: రోడ్డుపక్క పొదల్లోకి దూసుకువెళ్లిన స్కూలు బస్సు.. భయంతో కేకలు వేసిన విద్యార్థులు

Highlights

Mahabubabad: ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది పిల్లలు

Mahabubabad: మాహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి స్టేజి దగ్గర స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. రామగిరి నుంచి నెళ్లికుదురు వెళుతున్న శ్రీ సాయి పబ్లిక్ స్కూలు బస్సు అతివేగంతో మూలమలుపు తిరగలేక రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి దూసుకువెళ్లింది. దీంతో పిల్లలు భయంతో కేకలు వేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories