రైలు చక్రాల మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు

రైలు చక్రాల మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు
x
Highlights

రైలు చక్రాల మధ్యలో ఓ ప్రయాణికుడు ఇరుక్కుపోయాడు. ఈ ఘటన గత రాత్రి (సోమవారం) స్టేషన్‌ పెండ్యాల సమీపంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే .. పెండ్యాల...

రైలు చక్రాల మధ్యలో ఓ ప్రయాణికుడు ఇరుక్కుపోయాడు. ఈ ఘటన గత రాత్రి (సోమవారం) స్టేషన్‌ పెండ్యాల సమీపంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే .. పెండ్యాల సమీపంలో కాకతీయ ప్యాసింజరు రైలు వేగం తగ్గింది. గుర్తు తెలియని ప్రయాణికుడు దిగబోయి రైలు చక్రాల కిందపడ్డాడు. దాదాపుగా గంటసేపు నరకయాతన అనుభవించాడు. ఇందులో అతని కాలు ఒకటి పూర్తిగా తెగిపోగా మరో కాలు ఆ రైలు చక్రాల మధ్యలో ఇరుక్కుపోయింది.

రైలు ముందుకు వెళ్తే అతని మరో కాలు పోయే ప్రమాదం ఉండడంతో రైలును అక్కడే ఆపేశారు. అనంతరం రైలు డ్రైవర్ జీఆర్సీ, 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రయాణికుడ్ని బయటకు తీశారు. ఆ తర్వాత అతన్ని, అతనితో పాటు తెగిపోయిన కాలిని కూడా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories