హైదరాబాద్‌లో ఘోరం.. ఇంటర్ విద్యార్థిని ఢీకొట్టిన ఈడ్చుకుపోయిన లారీ

హైదరాబాద్‌లో ఘోరం.. ఇంటర్ విద్యార్థిని ఢీకొట్టిన ఈడ్చుకుపోయిన లారీ
x
Highlights

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని లారీ ఢీకొట్టి రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఎర్రగడ్డకు చెందిన ఎం.సాయికృష్ణ...

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని లారీ ఢీకొట్టి రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఎర్రగడ్డకు చెందిన ఎం.సాయికృష్ణ బుధవారం తన మిత్రులతో కలిసి ఓ ఫంక్షన్‌కు హాజరయ్యాడు. గురువారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో సాయి తన స్నేహితులతో కలిసి జీవీకే మాల్ మీదుగా ఖైరతాబాద్ వైపు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలోనే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ వద్దకు రాగానే అదుపు తప్పిన బైక్ కిందపడింది. అయితే అదే సమయంలోవెనక నుండి వేగంగా వస్తున్న లారీ సాయికృష్ణ పైనుంచి దూసుకెళ్లింది. అదే బైక్‌పై ఉన్న సాయి స్నేహితులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ సాయిని మాత్రం లారీ ఈడ్చుకుంటూ వెళ్లి ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఆగగా, హుటాహుటినా సాయిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయి ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories