TSPSC Paper Leak: కేసులో కీలక పరిణామం.. పేపర్‌ లీక్‌లో రూ.1.63 కోట్లు లావాదేవీలు..!

1.63 Crore Transactions In The Paper Leak.Key Development In The TSPSC Case
x

TSPSC: కేసులో కీలక పరిణామం..పేపర్‌ లీక్‌లో రూ.1.63 కోట్లు లావాదేవీలు..!

Highlights

TSPSC: పేపర్‌ లీక్‌ కేసులో మొత్తం 16 మంది మధ్యవర్తులు. న్యూజిలాండ్‌లో ఉన్న మరో నిందితుడు ప్రశాంత్‌రెడ్డి

TSPSC: TSPSC కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్‌ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. పేపర్‌ లీక్‌లో కోటి 63 లక్షల రూపాయల లావాదేవీలు జరిగాయని సిట్‌ పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో 49 మంది అరెస్ట్‌ అయ్యారు. పేపర్‌ లీక్‌ కేసులో మొత్తం 16 మంది మధ్యవర్తులు ఉన్నట్టు సిట్‌ తెలిపింది. 37 మందిపై అభియోగాలు నమోదు చేసింది సిట్. అలాగే.. మరో నిందితుడు ప్రశాంత్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్నట్టు గుర్తించింది. 8 మందికి డీఏఓ ప్రశ్నాపత్రం లీకైనట్టు పేర్కొంది. ఏఈ ప్రశ్నాపత్రం 13 మందికి చేరినట్టు గుర్తించింది. నలుగురికి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నాపత్రం, ఏడుగురికి ఏఈఈ ప్రశ్నాపత్రం లీకైనట్టు చార్జ్‌షీట్‌లో సిట్‌ పేర్కొంది. ఏఈఈ పరీక్షలో మరో ముగ్గురు చూచిరాతకు పాల్పడినట్టు గుర్తించింది. ఇక.. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను రామంతాపూర్‌ సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఉంచినట్టు సిట్‌ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories