14వరోజు కొనసాగుతోన్న సమ్మె..రేపటి బంద్ కు పెరుగుతోన్న మద్ధతు

14వరోజు కొనసాగుతోన్న సమ్మె..రేపటి బంద్ కు పెరుగుతోన్న మద్ధతు
x
Highlights

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కాసేపట్లో సమావేశం కానుంది. సమ్మెపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో జేఏసీ నేతలు చర్చించనున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కాసేపట్లో సమావేశం కానుంది. సమ్మెపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో జేఏసీ నేతలు చర్చించనున్నారు. సమ్మెపై కోర్టు ప్రస్తావించిన పలు అంశాలపై జేఏసీ సమాలోచనలు చేయనున్నట్టు పేర్కొంది. సమావేశంలో రేపు నిర్వహించే బంద్ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై జేఏసీ నాయకులు చర్చ జరపనున్నారు. ఇప్పటికే అన్ని వర్గాలు బంద్‌కు సహరిస్తామంటూ ప్రకటించాయని జేఏసీ తెలిపింది. ఇవాళ నాంపల్లి క్రిమినల్‌ కోర్టు నుంచి బస్‌భవన్‌ వరకు న్యాయవాదులు బైక్‌ ర్యాలీ చేపట్టనున్నారు.

సమ్మెలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. రాణిగంజ్ బస్ డిపో వద్ద మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొనున్నారు. ఇందిరాపార్కు దగ్గర ఆర్టీసీ మహిళా కార్మికులు నిరసన దీక్ష చేయనున్నారు. తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ టెంపుల్ బస్టాప్ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇవాళ బస్ భవన్ ముట్టడికి అడ్వకేట్ జేఏసీ పిలుపునిచ్చింది.

మరోవైపు ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆరా తీశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రితో చర్చించారు. కార్మికుల డిమాండ్లను వివరించడానికి గవర్నర్‌ వద్దకు రవాణాశాఖ కార్యదర్శిని మంత్రి పంపించారు. సమ్మె ప్రభావం, విద్యాసంస్థలకు దసరా సెలవుల పొడగింపు తదితర అంశాలపై గవర్నర్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే, సమ్మె పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా దిగివస్తుందో, లేదో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories