త్రిబుల్ వన్ జీవోపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ

*త్రిబుల్ వన్ జీవోపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం

Rama Rao
Updated on: 14 Sept 2022 12:44 PM IST
111GO will be heard in the Telangana High Court Today
X

త్రిబుల్ వన్ జీవోపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ

Telangana: త్రిబుల్ వన్ జీవోపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. త్రిబుల్ వన్ జీవోపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఏప్రిల్‌లో జారీ చేసిన జీవో 69 ప్రకారం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేశామని తెలిపింది ప్రభుత్వం. కమిటీ నివేదిక వచ్చే వరకు జీవో 111లో పేర్కొన్న.. ఆంక్షలు, నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయన్న ప్రభుత్వం.. జంట జలాశయాల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోర్టులో దాఖలైన పిటిషన్లు కొట్టివేయాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికపై నేడు హైకోర్టు విచారించనుంది.


Rama Rao

Rama Rao

Next Story