Redmi Projector 4 Pro: ఇక టీవీకి టాటా.. రెడ్‌మి కొత్త ప్రొజెక్టర్ లాంచ్..!

Redmi Projector 4 Pro: తాజాగా Xiaomi తన కొత్త ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. ఈ కంపెనీ చైనాలో Redmi ప్రొజెక్టర్ 4 ప్రోను ప్రారంభించింది.

Sai Teja
Published on: 26 Oct 2025 10:00 AM IST
Redmi Projector 4 Pro
X

Redmi Projector 4 Pro: ఇక టీవీకి టాటా.. రెడ్‌మి కొత్త ప్రొజెక్టర్ లాంచ్..!

Redmi Projector 4 Pro: తాజాగా Xiaomi తన కొత్త ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. ఈ కంపెనీ చైనాలో Redmi ప్రొజెక్టర్ 4 ప్రోను ప్రారంభించింది. Redmi వాచ్ 6, ఇతర IoT పరికరాలతో పాటు దీనిని కూడా ప్రారంభించారు. ఈ ప్రొజెక్టర్ మినిమలిస్ట్ బూడిద రంగు డిజైన్, ఫాబ్రిక్-చుట్టిన ముందు భాగాన్ని కలిగి ఆకర్షణీయంగా ఉంది. వాస్తవానికి ఈ ప్రొజెక్టర్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రెడ్‌మి ప్రొజెక్టర్ 4 ప్రో 600 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీంతో మీరు మీ ఇంట్లోని గోడను 120-అంగుళాల టీవీగా మార్చవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ధర, ఇతర స్పెసిఫికేషన్‌లను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రెడ్‌మి ప్రొజెక్టర్ 4 ప్రో ప్రీమియం డిజైన్‌తో అందుబాటులో ఉంది. అలాగే ఇది మినిమలిస్ట్ ఫాబ్రిక్ ఫ్రంట్, టెక్స్చర్డ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. దీని ద్వారా మీరు పూర్తి HD నాణ్యతలో కంటెంట్‌ను వీక్షించగలరు. ప్రొజెక్టర్ 600 ల్యూమెన్‌ల ప్రకాశాన్ని కలిగి ఉంది, అలాగే ఇది 45-అంగుళాల నుంచి 120-అంగుళాల వరకు స్క్రీన్‌లను ప్రొజెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది.

ఇది MediaTek MT9660 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. దీనికి 2GB RAM, 32GB స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇది ToF ఆటోఫోకస్, మాన్యువల్ ఫోకస్‌కు అనుకూలంగా ఉంది. ఇందులో మరొక విశేషం ఏమిటంటే ఈ ప్రొజెక్టర్‌లోనే డ్యూయల్ 8W స్పీకర్లు ఉన్నాయి. దీనికి కనెక్టివిటీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో USB 2.0, HDMI (ARC), 3.5mm జాక్, DC IN కూడా అందుబాటులో ఉన్నాయి. వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం కంపెనీ బ్లూటూత్ 5.1 ని కూడా అందిస్తుంది. ఇది వాయిస్ కంట్రోల్‌ను కూడా కలిగి ఉంది. అలాగే దీనిని మీరు రిమోట్ ద్వారా కూడా ఉపయోగించుకునే వెసులుబాటును కల్పిస్తుంది. దీని బరువు సుమారు 3 కిలోగ్రాములు, ఇది బూడిద రంగులో లభిస్తుంది.

రెడ్‌మి ప్రొజెక్టర్ 4 ప్రోను చైనాలో లాంచ్ చేశారు. దీని ధర 1,499 యువాన్లు (సుమారు రూ.18,470). ప్రస్తుతం ఇది చైనాలో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి దీనిని భారతదేశంలో ఎప్పుడు లాంచ్ చేస్తారు అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. Xiaomi భారత మార్కెట్లో స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తుంది, కానీ ఇంకా ప్రొజెక్టర్‌ను లాంచ్ చేయలేదని నిపుణులు వెల్లడించారు. త్వరలో లాంచ్ చేయవచ్చు అని వాళ్లు అభిప్రాయపడ్డారు.

Sai Teja

Sai Teja

Next Story