Recharge Plans: యూజర్ల జేబులకు చిల్లు.. మరోసారి 12శాతం పెరగనున్న రీచార్జ్ ప్లాన్ల ధరలు

Recharge Plans: మొబైల్ ఫోన్ వాడుతున్న వారికి బ్యాడ్ న్యూస్. త్వరలోనే రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు మళ్ళీ పెరగనున్నాయి. దాదాపు 12 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

CR Reddy
Updated on: 5 July 2025 10:31 AM IST
Recharge Plans
X

Recharge Plans: యూజర్ల జేబులకు చిల్లు.. మరోసారి 12శాతం పెరగనున్న రీచార్జ్ ప్లాన్ల ధరలు

Recharge Plans: మొబైల్ ఫోన్ వాడుతున్న వారికి బ్యాడ్ న్యూస్. త్వరలోనే రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు మళ్ళీ పెరగనున్నాయి. దాదాపు 12 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే, జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లందరి జేబులపై మరోసారి భారం పడనుంది. రిలయన్స్ జియో గురించి నిపుణులు తెలిపిన ప్రకారం.. జూన్‌లో ముగిసిన మొదటి త్రైమాసికంలో మొత్తం ఆదాయం, ప్రతి యూజర్‌ ద్వారా వచ్చే ఆదాయం(ARPU) వృద్ధిలో జియో, భారతీ ఎయిర్‌టెల్ ను వెనక్కి నెట్టింది. ఎక్కువగా డబ్బులు చెల్లించే ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు పెరగడం వల్ల జియో ఎయిర్‌టెల్‌ను అధిగమించింది. జేఎం ఫైనాన్షియల్ అంచనాల ప్రకారం.. జూన్ త్రైమాసికంలో జియో ARPU గత త్రైమాసికంతో పోలిస్తే 1.8 శాతం పెరిగి రూ.210 కు చేరే అవకాశం ఉంది.

ఎయిర్‌టెల్ రూ.249 అధిక ARPU ను నమోదు చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ దాని వృద్ధి రేటు 1.6 శాతం తక్కువగా ఉంది. మొదటి త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా (Vi) ARPU 1.6 శాతం మెరుగుపడతుందని అంచనా. దీనికి కారణం కంపెనీ 5G సేవలకు అప్‌గ్రేడ్ అవ్వడం, సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య పెరగడం. వోడాఫోన్ ఐడియా నికరంగా ఎక్కువ మంది యూజర్లను నిలబెట్టుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈక్విటీ రీసెర్చ్ సంస్థ బోఫా సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం.. టెలికాం కంపెనీలు ఇప్పటికే చేసిన ధరల పెంపు ప్రభావం పూర్తిగా కనిపించింది. ఇప్పుడు వచ్చే సంవత్సరమే ధరల పెంపు తదుపరి దశ కనిపిస్తుంది. వచ్చే ఏడాది టెలికాం కంపెనీలు టారిఫ్‌లను దాదాపు 12 శాతం వరకు పెంచవచ్చని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది.

ఎక్కువ మంది కస్టమర్లు చేరడం వల్ల ఆర్థిక సంవత్సరం 2026 మొదటి త్రైమాసికంలో జియో ఆదాయం 2.7 శాతం పెరిగి రూ.31,200 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే, దాని నికర లాభం రూ.6,640 కోట్లు వద్ద స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ వైర్‌లెస్ సేవల ద్వారా వచ్చే ఆదాయం గత త్రైమాసికంతో పోలిస్తే 2.6 శాతం పెరిగి రూ.27,305 కోట్లకు చేరుతుందని అంచనా, అయితే దాని కన్సాలిడేటెడ్ నికర లాభం 47 శాతం పెరిగి రూ.7,690 కోట్లకు చేరుకుంటుందని అంచనా. జేఎం ఫైనాన్షియల్ అంచనాల ప్రకారం.. వీఐ ఆదాయం గత త్రైమాసికంతో పోలిస్తే 1.1 శాతం పెరిగి రూ.11,100 కోట్లకు చేరుకుంటుంది.అయితే నికర నష్టం కొద్దిగా తగ్గి రూ.7,145 కోట్లు ఉంటుందని అంచనా.

CR Reddy

CR Reddy

Next Story