India vs Australia : 2017 చరిత్ర పునరావృతం అవుతుందా? ఆస్ట్రేలియాకు ఇండియా మరోసారి షాక్ ఇచ్చేనా?

India vs Australia : 2017 చరిత్ర పునరావృతం అవుతుందా? ఆస్ట్రేలియాకు ఇండియా మరోసారి షాక్ ఇచ్చేనా?
x

India vs Australia : 2017 చరిత్ర పునరావృతం అవుతుందా? ఆస్ట్రేలియాకు ఇండియా మరోసారి షాక్ ఇచ్చేనా?

Highlights

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ కీలక పోరు కోసం ఇరు జట్లు కఠోరంగా సాధన చేస్తున్నాయి.

India vs Australia : మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ కీలక పోరు కోసం ఇరు జట్లు కఠోరంగా సాధన చేస్తున్నాయి. ఆస్ట్రేలియా మహిళల ప్రపంచ కప్‌లో గత 15 మ్యాచ్‌లుగా అజేయంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను దీటుగా ఎదుర్కోవాలంటే టీమిండియా భారత క్రికెట్ చరిత్ర నుండి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు కూడా ఆస్ట్రేలియా జట్లు ఇలాగే చాలా మ్యాచ్‌లు గెలిచి భారత్‌తో తలపడ్డాయి. అలాంటి సందర్భాల్లో భారత్ ఆస్ట్రేలియా విజయరథాన్ని అడ్డుకుంది.

క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు రెండుసార్లు ఆస్ట్రేలియా విజయాలకు అడ్డుకున్న వేసింది భారత్. తేడా ఒక్కటే, మూడోసారి ఆ అద్భుతం చేయాల్సింది మన అమ్మాయిలు. అంతకుముందు ఆస్ట్రేలియా విజయరథాన్ని రెండుసార్లు అడ్డుకున్నది భారత పురుషుల జట్టు. భారత పురుషుల క్రికెట్ జట్టు మొదటిసారిగా 2001లో ఆస్ట్రేలియా విజయరథాన్ని నిలువరించింది. అప్పుడు వారు 16 మ్యాచ్‌ల వరుస విజయాల పరంపరను ఛేదించారు. ఆ తర్వాత 7 సంవత్సరాలకు, 2008లో భారత్ మరోసారి పెర్త్ టెస్టులో విజయం సాధించి, ఆస్ట్రేలియా 16 మ్యాచ్‌ల అజేయ ప్రస్థానానికి ముగింపు పలికింది. ఈ సందర్భంగా భారత పురుషుల క్రికెట్ జట్టు పెర్త్‌లో టెస్టు గెలిచిన ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా మొదటి ఆసియా జట్టుగా నిలిచింది.

భారత పురుషుల జట్టు క్రికెట్ మైదానంలో రెండుసార్లు చేసిన ఆ అద్భుతం నుండి స్ఫూర్తి పొంది, మూడోసారి ఆస్ట్రేలియా విజయరథాన్ని మన ఉమెన్స్ జట్టు అడ్డుకుంటుందా ? ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు తమ పురుషుల జట్టులా 16 కాకుండా 15 మ్యాచ్‌లు గెలిచింది. అంతేకాకుండా వారు 2017 ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు.

అయితే, మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా విజయాల పరంపరను నిలువరించే సత్తా భారత జట్టుకు పుష్కలంగా ఉంది. 8 సంవత్సరాల క్రితం, అంటే 2017 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాను చివరిసారిగా నాకౌట్‌లో ఓడించిన జట్టు భారత్. అప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాట్ నుండి వెలువడిన 171 పరుగుల ఇన్నింగ్స్ సహాయంతో భారత్ ఆస్ట్రేలియాను 36 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా భారత జట్టుకు ప్రోత్సాహం అందించే అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 2017 జూలై 20న మహిళల వన్డే ప్రపంచ కప్‌లో జరిగిన అద్భుతం 2025 అక్టోబర్ 29న కూడా జరగవచ్చు. దీనితో పాటు, నవీ ముంబైలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనున్న సెమీఫైనల్ మొదటి మ్యాచ్ కావడం భారత మహిళలకు అదనపు ప్రయోజనం. స్వదేశీ ప్రేక్షకుల మద్దతుతో మన అమ్మాయిలు చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories