కోహ్లిసేన సెమిస్ లో ఢీ కొట్టేది ఎవరితో ?

కోహ్లిసేన సెమిస్ లో ఢీ కొట్టేది ఎవరితో ?
x
Highlights

క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ తుదిదశకు చేరుకున్నాయి .. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్ , ఇంగ్లాండ్ , న్యూజిలాండ్ జట్లు...

క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ తుదిదశకు చేరుకున్నాయి .. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్ , ఇంగ్లాండ్ , న్యూజిలాండ్ జట్లు పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి .. దాదాపుగా ఇవే జట్లు సెమిస్ కి చేరినట్టు లెక్క .. ఇందులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది .

అయితే ఇప్పుడు భారత్ తన సెమి ఫైనల్ మ్యాచ్ ఏ జట్టుతో ఆడనుంది అన్నది చాలా ఆసక్తికరంగా మారింది .. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్టు మరియు నాలుగో స్థానంలో ఉన్న జట్టు మధ్య ఒక సెమిస్ మ్యాచ్ జరుగుతుంది. అలాగే రెండో స్థానంలో ఉన్న జట్టు మరియు మూడో స్థానంలో జట్టు మధ్య మరో సెమిస్ జరుగుతుంది . ఈ లెక్కన చూసుకుంటే రెండో స్థానంలో ఉన్న భారత్ మరియు మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమిస్ జరుగుతుంది . అయితే ఈ సమీకరణాలు చేంజ్ అయ్యే అవకాశం లేకపోలేదు ..

ఆస్ట్రేలియా జట్టు తన చివరి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది . అలాగే భారత్ కూడా తన చివరి మ్యాచ్ శ్రీలంకతో పోటిపడనుంది .. ఇందులో ఆసిస్ పై దక్షిణాఫ్రికా గెలిచి శ్రీలంక పై భారత్ గెలిస్తే అప్పుడు పాయింట్ల పట్టికలో భారత్ ముందుకు వెళ్లి ప్రధమ స్థానంలో ఉంటుంది . అప్పుడు ఇండియా న్యూజిలాండ్ తొ సెమిస్ ఆడాల్సి వస్తుంది . ఒకవేళ ఆసిస్, భారత్ గెలిచినా భారత్ రెండో స్థానంలోనే కొనసాగుతుంది .అప్పుడు ఇంగ్లాండ్ తోనే సెమిస్ ఆడాల్సి వస్తుంది. రెండు సెమిస్ ల నుండి గెలిచినా జట్లు ఫైనల్ మ్యాచ్ లో తలపడుతాయి .. మరో ఎం జరుగుతుందో చూడాలి ..

Show Full Article
Print Article
Next Story
More Stories