ఓయ్ అంపైర్లు ఏం చూస్తున్నారు.. స్టంప్స్ మైక్‌లో కోహ్లీ మాటలు రికార్డు

viratkohli
x

విరాట్ కోహ్లీ ఫైల్ ఫోటో 

Highlights

చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ ఆటగాడిపై ఫిర్యాదు చేశారు. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా అశ్విన్ బౌలింగ్‌లో బంతిని పాయింట్ దిశగా హిట్ చేసిన జోప్రా ఆర్చర్.. జాక్ లీచ్‌తో కలిసి సింగిల్‌ను పూర్తి చేశాడు. ఈ క్రమంలో జోఫ్రా ఆర్చర్ పిచ్‌ మధ్యలో పరుగెత్తాడు. ఇది కోహ్లికి తీవ్ర అసహనానికి గురిచేసింది. జోప్రా పిచ్‌లోని డేంజర్ జోన్‌లో అడుగులు వేయడంపై కోహ్లీ ఫిర్యాదు చేశాడు. వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోహ్లీ అన్న మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డు అయ్యాయి.

కోహ్లి.. అసలు ఫీల్డ్‌ అంపైర్లు ఏం చూస్తున్నారు అంటూ .. నితిన్‌ మీనన్‌.. పిచ్‌ మధ్యలో పరుగెడుతూ సింగిల్స్ తీస్తున్నారు. అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్‌ 178 పరుగులకే ఆలౌటైంది. తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీగా ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్‌ నిర్దేశించిన 420 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కోహ్లీ సేన చతకిలబడింది. భారత్ రెండో ఇన్నింగ్స్ 192 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది.



Show Full Article
Print Article
Next Story
More Stories