Ind vs Eng: 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసిన ఇంగ్లండ్

Team India Scored the 364 Runs in First Innings
x
తొలి ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేసిన ఇండియా (ఫైల్ ఇమేజ్)
Highlights

Ind vs Eng: సిరాజ్ రెండు, మహ్మద్ షమీకి ఒక వికెట్‌ * తొలి ఇన్నింగ్‌లో 364 పరుగులు చేసిన టీమిండియా

Ind vs Eng: లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రోరీ బర్న్స్, డోమిక్ సిబ్లీ, హమీద్ జో రూట్ వికెట్లు సమర్పించుకోగా.. కెప్టెన్ జో రూట్ 48 పరుగులు, బెయిర్​స్టో 6 పరుగులతో నాటౌట్​గా నిలిచారు. ఇక టీమిండియా బౌలర్లు సిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకుముందు భారత్ తన ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 364 పరుగులు చేసింది.

మరోవైపు.. 3వికెట్ల నష్టానికి 276 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఆదిలోనే తడబడింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి నిలవలేక.. రెండు పరుగులకే ఒక వికెట్ సమర్పించుకుంది. మ్యాచ్ ప్రారంభం అయిన కాసేపటికే రాహుల్, రహానే వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు. వీరి తరువాత వచ్చిన పంత్, జడేజా కాస్త రాణించారనే చెప్పాలి. ఇద్దరూ కలిసి 49 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ, ఈసారి బ్యాడ్ టైమ్ మార్క్ వుడ్ రూపంలో వచ్చింది. పంత్‌ షాట్‌కు ట్రై చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి కీపర్ చేతికి చిక్కింది. దాంతో పంత్ వెనుదిరిగారు. మొత్తంగా ఇవాళ 88 పరుగులు చేసి 7 వికెట్లు సమర్పించుకుంది టీమిండియా.

Show Full Article
Print Article
Next Story
More Stories