T20 World Cup 2026: మరో 3 వారాల్లో మెగా టోర్నీ.. టీమిండియాను వణికిస్తున్న ఆ 'మూడు' గండాలు!

టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియాను గాయాలు, కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ మరియు గంభీర్ కోచింగ్‌లోని రికార్డులు టెన్షన్ పెడుతున్నాయి. పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి.

santhoshi
Published on: 17 Jan 2026 11:35 AM IST
T20 World Cup 2026: మరో 3 వారాల్లో మెగా టోర్నీ.. టీమిండియాను వణికిస్తున్న ఆ మూడు గండాలు!
X

టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 7న భారత్, యూఎస్‌ఏ జట్ల మధ్య జరిగే పోరుతో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా వరుస విజయాలతో జోరు మీదున్నా, తెరవెనుక కొన్ని సమస్యలు మేనేజ్‌మెంట్‌ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూడు అంశాలు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి.

1. స్టార్ ప్లేయర్ల గాయాల బెడద

ప్రపంచకప్ ముందు ఆటగాళ్ల ఫిట్‌నెస్ టీమిండియాను ఆందోళనకు గురి చేస్తోంది.

తిలక్ వర్మ: గత ఆసియా కప్‌లో అద్భుత ఫామ్‌తో జట్టును ఆదుకున్న తిలక్ వర్మకు ఎమర్జెన్సీ సర్జరీ జరగడం షాకింగ్ న్యూస్. ప్రస్తుతం అతను కోలుకుంటున్నా, కివీస్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

వాషింగ్టన్ సుందర్: ఆల్ రౌండర్ సుందర్ పక్కటెముకల గాయంతో టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని వరల్డ్ కప్ అవకాశాలు ప్రస్తుతం 50-50గా కనిపిస్తున్నాయి. ఒకవేళ సుందర్ అందుబాటులో లేకపోతే జట్టు బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉంది.

2. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్

ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది కాలంగా సూర్య బ్యాట్ నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రావడం లేదు.

క్రీజులోకి రావడం, త్వరగా అవుట్ అవ్వడం అభిమానులను నిరాశపరుస్తోంది.

'మెగా టోర్నీలో రెచ్చిపోతా' అని సూర్య ధీమా వ్యక్తం చేస్తున్నా, మిడిల్ ఆర్డర్‌లో అతని ఫామ్ భారత్ విజయాల్లో అత్యంత కీలకం కానుంది.

3. 'బి' టీమ్ విజయాన్నే నమ్ముకుందామా?

గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి భారత్ టీ20ల్లో ఓడిపోలేదు. అయితే, ఈ విజయాల వెనుక ఒక చిన్న లాజిక్ ఉంది.

భారత్ ఇటీవల గెలిచిన సిరీస్‌లన్నీ బలహీనమైన జట్లు లేదా ప్రత్యర్థి దేశాల 'బి' టీమ్‌లపైనే వచ్చాయి.

గతేడాది ఆస్ట్రేలియా తన పూర్తి స్థాయి జట్టుతో ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారత్ తడబడింది. ఆ తర్వాత ఆసీస్ తమ మెయిన్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వడంతో భారత్ గెలిచింది.

ఆసియా కప్‌లోనూ పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో తిలక్ వర్మ అద్భుతం చేయకపోతే భారత్ ఓడిపోయే పరిస్థితి ఉండేది.

కివీస్ సిరీస్.. అసలైన పరీక్ష!

జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ టీమిండియాకు 'ప్రీ-ఫైనల్' లాంటిది. ఎందుకంటే కివీస్ తమ వరల్డ్ కప్ స్క్వాడ్‌తోనే ఈ సిరీస్ ఆడబోతోంది. ఇక్కడ గెలిస్తేనే భారత్ అసలైన సత్తా ఏంటో బయటపడుతుంది.

santhoshi

santhoshi

Next Story