
Preity Zinta: థర్డ్ అంపైర్ నిర్ణయంపై ప్రీతి జింటా ఆగ్రహం
Preity Zinta: బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ జట్టు సహ-యజమాని ప్రీతి జింటా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.
Preity Zinta: బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ జట్టు సహ-యజమాని ప్రీతి జింటా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటీవల తన పిల్లల ఫోటోలు అనుమతి లేకుండా తీస్తే 'కాళీ' అవతారం ఎత్తుతానని చెప్పిన ప్రీతి, ఇప్పుడు మాత్రం క్రికెట్ మ్యాచ్లో జరిగిన ఒక 'పెద్ద తప్పు' పై మండిపడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓటమి తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
ప్రీతి జింటా కోపానికి కారణం ఏమిటి?
ప్రీతి జింటా కోపానికి పంజాబ్ కింగ్స్ ఓటమి మాత్రమే కారణం కాదు. మ్యాచ్లోని 15వ ఓవర్లో జరిగిన ఒక సంఘటన ఆమెను ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఓవర్లోని ఐదవ బంతిని ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మోహిత్ శర్మ విసిరాడు. బంతిని ఎదుర్కొన్న పంజాబ్ బ్యాట్స్మెన్ శశాంక్ సింగ్ భారీ షాట్ కొట్టాలని ప్రయత్నించాడు. బంతి బ్యాట్కు తగిలి బౌండరీ లైన్ దాటి 6 పరుగుల కోసం వెళ్తున్నట్లు కనిపించింది. అయితే, బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ కరుణ్ నాయర్ బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. అతను బంతిని దాదాపుగా ఆపగలిగాడు. కానీ బంతిని ఆపే సమయంలో అతని కాలు బౌండరీ లైన్ను తాకినట్లు కనిపించింది.
థర్డ్ అంపైర్ నిర్ణయంపై ప్రీతి ఆగ్రహం
కరుణ్ నాయర్ ప్రకారం.. అది సిక్స్. కానీ, థర్డ్ అంపైర్కు విషయాన్ని రిఫర్ చేయగా, అక్కడే అసలు కథ మొదలైంది. థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రీతి జింటాను ఆగ్రహానికి గురిచేసింది. బంతిని ఆపిన కరుణ్ నాయర్ స్వయంగా అది సిక్స్ అని చెప్పినప్పటికీ, థర్డ్ అంపైర్ దాన్ని సిక్స్గా ప్రకటించడానికి నిరాకరించాడు. దీంతో పంజాబ్ కింగ్స్కు 6 పరుగులు రావాల్సిన చోట, కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది.
In a such a high profile tournament with so much technology at the Third Umpire’s disposal such mistakes are unacceptable & simply shouldn’t happen. I spoke To Karun after the game & he confirmed it was DEFINITELY a 6 ! I rest my case ! #PBKSvsDC #IPL2025 https://t.co/o35yCueuNP
— Preity G Zinta (@realpreityzinta) May 24, 2025
ఇలాంటి తప్పులు సహించరానివి
ఈ అన్యాయం పై ప్రీతి జింటా మ్యాచ్ తర్వాత తీవ్రంగా మండిపడ్డారు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అది ఒక పెద్ద తప్పిదమని, ఐపీఎల్లో ఇలాంటి తప్పులకు చోటు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. ప్రీతి జింటా తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్లో ఇలా రాశారు.. "ఐపీఎల్ వంటి హై-ప్రొఫైల్ టోర్నమెంట్లో ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ ఇలాంటి తప్పులు చేస్తే అది సహించరానిది. ఇలా జరగకూడదు." మ్యాచ్ ముగిసిన తర్వాత కరుణ్ నాయర్తో తాను మాట్లాడానని, అది ఖచ్చితంగా సిక్స్ అని అతను ధృవీకరించాడని కూడా ప్రీతి జింటా తెలిపారు.
ఒక్క నిర్ణయం పంజాబ్ కింగ్స్ గెలుపు అవకాశాలను దెబ్బతీసిందా?
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ను 3 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. థర్డ్ అంపైర్ ఆ తప్పు చేసి ఉండకపోతే, పంజాబ్ కింగ్స్కు ఆ 6 పరుగులు వచ్చి ఉంటే, వారి స్కోరు 211 పరుగులు చేరి ఉండేది. అప్పుడు పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. థర్డ్ అంపైర్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇప్పుడు పంజాబ్ కింగ్స్ టాప్-2లో నిలుస్తుందా లేదా అనే ప్రశ్నలను కూడా లేవనెత్తింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




