టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఇంట విషాదం

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఇంట విషాదం
x
Virat Kohli (File Photo)
Highlights

భారత క్రికెట్ జట్టు సారథి విరాట్‌ కోహ్లి ఇంట విషాదం నెలకొంది.

భారత క్రికెట్ జట్టు సారథి విరాట్‌ కోహ్లి ఇంట విషాదం నెలకొంది. బుధవారం ఉదయం వీరి ఇంటి పెంపుడు శునకం బ్రునో మృతి చెందింది. ఈ విషయాన్ని విరాట్ కోహ్లి ట్వీట్ చేశారు. కోహ్లికి బ్రూనో అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్‌ మీడియాలో యాక్టివ్ గా ఉండే కోహ్లీ తరచూ బ్రూనోతో దిగిన ఫోటోలను షేర్‌ చేస్తుండేవాడు. ఒత్తిడి తగ్గించుకోవడానికి బ్రునోతో ఆడుకునేవాడినని అతడు ఎన్నో సార్లు వెల్లడించాడు.

బ్రునో మృతి చెందిన విషయాన్ని కోహ్లి తన ట్వీట్ ఖాతాలో షేర్ చేశారు. '11 సంవత్సరాల మన ప్రయాణం జజీవితాంతం మధురానుభూతుతిగా మిగిలిపోతుంది. ఎప్పుడు నీ ప్రేమను మాపై కురిపించావు. ఇవాళ తనువు చాలించి వెళ్ళావు. నీ ఆత్మకు శాంతి చేకూరేలాని భగవంతుడిని కోరుకుంటున్నా. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ బ్రూనో' అంటూ కోహ్లీ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 'మిస్‌ యూ బ్రూనో రెస్ట్ ఇన్ పీస్ (రిప్‌)' అంటూ అనుష్క ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories