నో డౌట్ ఆసీస్‌ పర్యటన కొనసాగుతుంది.. అడిలైడ్‌లో గులాబి పోరు

నో డౌట్ ఆసీస్‌ పర్యటన కొనసాగుతుంది.. అడిలైడ్‌లో గులాబి పోరు
x
Highlights

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటినపై సందిగ్ధం నెలకొంది.

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటినపై సందిగ్ధం నెలకొంది. అయితే ఈ సిరీస్ లో భారత్ టెస్టులు మాత్రమే ఆడుతుందా.. అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఊహాగానాలకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ముగింపు పలికింది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా పర్యటనలో నాలుగు టెస్టులతో పాటు టీ20, వన్డే సిరీస్‌ల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సిరీస్‌ల తేదీలను గురువారం తన అధికారిక వెబ్‌సైట్‌లో సీఏ వెల్లడించింది.

ఆస్ట్రేలియాతో అక్టోబర్‌ 11న బ్రిస్బేన్‌లో జరుగనున్న తొలి టీ20తో జరగనుంది. ఆ తర్వాతి రెండు, మూడు, టీ20లు మ్యాచ్‌లు 14(కాన్‌బెర్రా), 17(అడిలైడ్‌)న జరుగనున్నాయి. కాగా భారత్‌ - ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ డిసెంబర్‌ 3న బ్రిస్బేన్‌లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత అడిలైడ్‌(డిసెంబర్‌ 11-15)లో ఇరు జట్ల మధ్య డై అండ్‌ నైట్‌ టెస్టు పోరు జరుగనుంది. మూడు, నాలుగో టెస్టులు మెల్‌బోర్న్‌(డిసెంబర్‌ 26-30), సిడ్నీ(జనవరి 3-7) వేదికగా జరుగనున్నాయి.జనవరి 12న పెర్త్‌లో జరుగనున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో కోహ్లీసేన తలపడనుంది. ఆ తర్వాత చివరి రెండు వన్డేలు మెల్‌బోర్న్‌(జనవరి 15), సిడ్నీ(జనవరి 17) వేదికగా జరుగనున్నాయి. మరోవైపు మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుందని సీఏ ప్రకటించింది. ఈ మ్యాచ్‌ ఆడితే విదేశాల్లో టీమిండియా ఇదే తొలి గులాబీ బంతి పోరు కానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories