అందుకు కోహ్లీకి కృతజ్ఞతలు : గంగూలీ

అందుకు కోహ్లీకి కృతజ్ఞతలు : గంగూలీ
x
Highlights

ఈడెన్ గార్డెన్స్ చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. బంగ్లాదేశ్, భారత్ ఆడే డే-నైట్‌ మ్యాచ్ అక్కడ నిర్వహించనున్నారు.

ఈడెన్ గార్డెన్స్ చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. బంగ్లాదేశ్, భారత్ ఆడే డే-నైట్‌ మ్యాచ్ అక్కడ నిర్వహించనున్నారు. దీనికి అంగీకరించిన టీమిండియా సారధి విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కొన్ని కారణాల వలన డే-నైట్‌ టెస్టులు బీసీసీఐ ఒప్పుకోలేదు. అయితే తాజాగా గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే డే-నైట్‌ టెస్టులు నిర్వహనపై దృష్టి పెట్టారు.

అయితే దీనిపై భారత క్రికెట్ జట్టు సారధి కోహ్లీ ఒప్పించిన అనంతరం మరో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ)ను గంగూలీ అంగీకరించేలా చేశారు. తొలి డే-నైట్‌ టెస్టుకు ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించేందుకు మార్గం సుగుమమైంది. సంప్రదాయ క్రికెట్ రక్షించాలంటే కొన్ని మార్పలకు శ్రీకారం చుట్టాలని గంగూలీ తెలిపారు. పింక్‌బాల్‌ టెస్టుకు అంగీకరించిన కోహ్లీకి ప్రత్యేక కృతజ్ఞతలు అని గంగూలీ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories