పింక్ రంగు బంతుల ఆకారంలో స్వీట్లను ట్వీట్టర్‌లో పోస్టు చేసిన గంగూలీ

పింక్ రంగు బంతుల ఆకారంలో స్వీట్లను ట్వీట్టర్‌లో పోస్టు చేసిన గంగూలీ
x
Highlights

ఈ టెస్టు మ్యాచ్ సందర్భంగా కోల్‌కతాలో ఓ అభిమాని చేసిన ఫిక్ కలర్ స్వీట్స్ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ఆకట్టుకున్నాయి.

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా బంగ్లాదేశ్ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌ పింక్ బాల్‌తో జరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ అలముకుంది. ఈ టెస్టు మ్యాచ్ సందర్భంగా కోల్‌కతాలో ఓ అభిమాని చేసిన ఫిక్ కలర్ స్వీట్స్ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ఆకట్టుకున్నాయి. క్రికెట్ అభిమాని సందేశ్ చేసిన స్వీట్స్ ను గంగూలీ తన వ్యక్తిగత ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. పింక్ బాల్స్ ఆకారంలో తయారు చేసి ఉన్న స్వీట్స్ ఫొటోల‌ను ట్వీట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

తొలిరోజు మ్యాచ్ లో బంగ్లాపై పూర్తి ఆధిపత్యాన్ని భారత్ ప్రదర్శించింది . తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 106 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇందులో ఆ జట్టు ఓపెనర్ ఇస్లాం ఒక్కడే 29 పరుగులు చేసి టాప్ లో నిలిచాడు. భారత్ బౌలర్ల ధాటికి బంగ్లా కుదేలైంది.

ఆ తర్వాత ఇన్నింగ్స్ ని ప్రారంభించిన భారత్ కి ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్ లో డబల్ సెంచరీ చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన మయంక్ అగర్వాల్14(21) ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పుజారాతో ఇన్నింగ్స్ ని కొనసాగించిన రోహిత్ శర్మ 21(35) కాసేపటికే వెనుదిరిగాడు.

51 పరుగులకి రెండు వికెట్లు కోల్పోయిన భారత ఇన్నింగ్స్ ని కెప్టెన్ కోహ్లి , పుజారా కలిసి చక్కదిద్దే పని పెట్టుకున్నారు. మరో వికెట్ పడుకుంటా జాగ్రత్తపడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రహనే క్రీజ్ లోకి వచ్చాడు. మరో వికెట్ పడకుండా చూసుకుంటూ ఆడుతూ తొలిరోజు ఆటను ముగించారు. ప్రస్తుతం భారత్ మూడు వికెట్లను కోల్పోయి 174 పరుగులని సాధించింది. ఇందులో 68 పరుగుల ఆధిక్యంలో ఉంది .




Show Full Article
Print Article
More On
Next Story
More Stories