మళ్లీ రాజస్తాన్‌ గెలుపు

మళ్లీ రాజస్తాన్‌ గెలుపు
x
Highlights

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 162 పరుగుల...

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్‌ 19.1 ఓవర్లలో ఛేదించింది. ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను డీకాక్‌-రోహిత్‌ శర్మలు ఆరంభించారు. అయితే రోహిత్‌ శర్మ(5) నిరాశపరిచాడు. దాంతో ముంబై ఇండియన్స్‌ 11 పరుగులకే ఒక వికెట్‌ను కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌.. డీకాక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే డీకాక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ముంబై స్కోరు 108 పరుగుల వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌(34) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

అటు తర్వాత డీకాక్‌-హార్దిక్‌ పాండ్యాల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. డీకాక్‌(65;47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక‍్సర్లు) మూడో వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు. ఇక పొలార్డ్‌(10), హార్దిక్‌ పాండ్యా(23)లు స్కోరు పెంచే క్రమంలో ఔటయ్యారు. చివర్లో బెన్‌ కట్టింగ్‌ 9 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌ సాయంతో​ 13 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అజింక్యా రహానే(12) విఫలమయ్యాడు, అయితే కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(59 నాటౌట్‌; 48 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌)) బాధ్యతాయుతంగా ఆడి జట్టు విజయానికి కృషి చేశాడు. రియాన్‌ పరాగ్‌(43; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌) మెరుపులు మెరిపించడంతో రాజస్తాన్‌ విజయం నమోదు చేసింది. అలాగే సంజూ శాంసన్‌(35; 19 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories