భారత క్రికెటర్ల సరదా వీడియో పోస్ట్ చేసిన శిఖర్ ధావన్

Team India
x
Team India
Highlights

మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ తన ఇస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేశాడు. హౌజ్ ఫుల్ 4 లో చిత్రంలో అక్షయ్ కుమార్ నటించింన ఓ సన్నివేశాన్ని వారు అనుకరిస్తూ ఈ వీడియో తన ఇస్టాలో పోస్టు చేశాడు

బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20తో ఘోర పరాభవం చవిచూసిన భారత్ తర్వాత తేరుకుంది. రాజ్ కోట్ లో జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాను చిత్తుచితుగా ఓడించింది. బంగ్లా విధించిన 154పరుగలు విజయ లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ తోడు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 31 పరుగులు చేశాడు. తొలి వికెట్ కు ఇద్దరూ కలిసి 118 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ తన ఇస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేశాడు. హౌజ్ ఫుల్ 4 లో చిత్రంలో అక్షయ్ కుమార్ నటించింన ఓ సన్నివేశాన్ని వారు అనుకరిస్తూ ఈ వీడియో తన ఇస్టాలో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ధావన్ తో పాటు చాహల్, ఖలీల్ అహ్మద్ కూడా ఉన్నారు. ఈ వీడియోను భూవి ట్రోల్ చేశాడు.

ఈ వీడియలో చాహల్ శబ్ధం చేస్తుండగా మతిమరుపు వచ్చిన వాడిలా ధావన్ నటిస్తున్నాడు. ఇది చూసిన భూవి కామెంట్ చేశాడు. మరిచిపోయినట్లు నటించడం ఎందుకు అది సహజంగా ఉన్న అలవాటే కదా అంటూ సరదాగా కామెంట్ పెట్టాడు. భారత్ బంగ్లా మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ ఈ నెల పదో తేదీనా నాగ్ పూర్ లో జరగనుంది. ఇరుజట్లు 1-1తో సమానంగా నిలిచాయి. చివరి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారిదే సిరీస్. చివరి మ్యాచ్ విజయం కోసం బంగ్లా కసరత్తు ప్రారంభించింది. బంగ్లాకు మరో అవకాశం ఇవ్వకుడదని భారత్ భావిస్తోంది.







Show Full Article
Print Article
More On
Next Story
More Stories