Paris Paralympics 2024: పారా ఒలింపిక్స్ లో భారత్ కు డబుల్ ధమాకా..హైజంప్ లో రెండు పతకాలు

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ అదరగొట్టింది. హైజంప్ లో శరద్ కుమార్, మరియప్పన్ తంగవేలు రెండు పతకాలు సాధించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు అద్బుత ప్రదర్శన చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Sept 2024 6:36 AM IST
Sharad Kumar Mariappan Thangavelu Wins Silver Bronze High Jump Paralympics 2024
X

Paris Paralympics 2024: పారా ఒలింపిక్స్ లో భారత్ కు డబుల్ ధమాకా..హైజంప్ లో రెండు పతకాలు

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో, హైజంప్‌లో T63 విభాగంలో భారత అథ్లెట్లు శరద్ కుమార్, మరియప్పన్ తంగవేలు రజతం , కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఈ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసి భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టారు. 19 ఏళ్ల అమెరికా క్రీడాకారిణి ఎజ్రా ఫ్రెచ్ 1.94 మీటర్ల జంప్‌తో కొత్త పారాలింపిక్ రికార్డు సృష్టించింది. శరద్ కుమార్ గత కొంత కాలంగా భారత్ తరఫున మంచి ప్రదర్శన చేస్తున్నాడు. గత పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకాన్ని కూడా సాధించాడు. ఈసారి తన పతకం రంగు మార్చుకున్నాడు. శరద్ ఒకప్పుడు హైజంప్‌లో T63 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుస్తడుకున్నాం. కానీ అమెరికన్ అథ్లెట్ అతని కలలను నెరవేరనివ్వలేదు. వ్యక్తిగత అత్యుత్తమ జంప్ 1.88 మీటర్లను అధిగమించలేకపోయాడు.ఈ కారణంగా కేవలం రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

మరియప్పన్ తంగవేలు పారాలింపిక్స్ 2016లో బంగారు పతకం, 2020లో రజత పతకం, ఈసారి కాంస్య పతకం సాధించారు. వరుసగా మూడు పారాలింపిక్స్‌లో పతకాలు సాధించాడు. పతకం రేసులో తంగవేలు, శరద్ కుమార్ మినహా మరో భారతీయుడు ఉన్నాడు. అతని పేరు శైలేష్ కుమార్. కానీ పతకం సాధించలేక నాలుగో స్థానంలో నిలిచాడు. పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. భారత్ ఇప్పటి వరకు 3 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్య పతకాలతో మొత్తం 20 పతకాలు సాధించింది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో 18వ స్థానంలో ఉంది. గతసారి భారత్ మొత్తం 19 పతకాలు సాధించింది.



ఇక పారిస్ పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 అథ్లెటిక్స్ ఈవెంట్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత భారతదేశానికి చెందిన దీప్తి జీవన్‌జీ 55.82 సెకన్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచింది. ఈ నెల 21వ ఏట అడుగుపెట్టనున్న దీప్తి ఉక్రెయిన్‌కు చెందిన యులియా షుల్యార్ (55.16 సెకన్లు), ప్రపంచ రికార్డు హోల్డర్ టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ (55.23 సెకన్లు) తర్వాత మూడో స్థానంలో నిలిచింది.

20 ఏళ్ల దీప్తి ఈ ఏడాది ప్రారంభంలో కోబ్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 55.07 సెకన్ల ప్రపంచ రికార్డుతో గెలిచి పారిస్‌కు వచ్చింది. హాంగ్‌జౌ ఆసియా క్రీడలు 2023లో 56.69 సెకన్ల టైమింగ్‌తో బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది. సెప్టెంబర్ 2న హీట్ 2లో ఫైనల్‌కు అర్హత సాధిస్తుండగా దీప్తి ప్రపంచ రికార్డును టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ బద్దలు కొట్టింది. ఒండర్ 54.96 సెకన్ల టైమింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించింది. ఫైనల్‌లో ఐసెల్ ఒండర్ 55.23 సెకన్ల టైమింగ్‌తో రజత పతకాన్ని గెలుచుకుంది. దీప్తి 55.82 సెకన్లలో సగం సెకను వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story