మళ్లీ గ్రౌండ్‌లోకి షకిబుల్ హసన్ !

మళ్లీ గ్రౌండ్‌లోకి షకిబుల్ హసన్ !
x
Highlights

బుకీలు సంప్రదించిన విషయాన్ని తెలియజేయలేదని బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ పై ఐసీసీ రెండేళ్ల పాటు నిషేధం విధించింన సంగతి తెలిసిందే. రెండేళ్లు క్రికెట్‌...

బుకీలు సంప్రదించిన విషయాన్ని తెలియజేయలేదని బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ పై ఐసీసీ రెండేళ్ల పాటు నిషేధం విధించింన సంగతి తెలిసిందే. రెండేళ్లు క్రికెట్‌ నుంచి నిషేధానికి గురైనా షకిబుక్ తన భవిష్యత్తు దృష్టి సారించాడు. 2020లో ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌కు షకిబుల్‌ ఐసీసీ నిషేదం కారణంగా దూరం అవుతున్నాడు. అయితే తాజాగా షికిబుల్ మరో అవతారం ఎత్తాడు ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ మారాడు.

బంగ్లాదేశ్‌ ఆర్మీ స్టేడియంలో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్‌లో గ్రౌండ్ లో అడుగు పెట్టాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. కొరియన్‌ ఎక్స్‌పాట్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఫూటీ హ్యాగ్స్‌కు షకిబుల్ హసన్ ప్రాతినిథ్యం వహించాడు. కొరియన్‌ ఎక్స్‌పాట్‌పై ఫూటీ హ్యాగ్స్‌ 3-2 తేడాతో విజయం సాధించింది.

షకిబుల్ హసన్ లేకుండా భారత్ లో బంగ్లా జట్టు పర్యటించింది. టీమిండియా బంగ్లాదేశ్ మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఢిల్లీ మ్యాచ్ లో బంగ్లా ఘన విజయం సాధించగా... రాజ్ కోట్ వేధికగా జరిగిన మ్యాచ్ భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో బంగ్లా పులులపై చెలరేగిన విషయం తెలిసిందే. ఇరు జట్లు 1-1 గెలుపుతో సమానంగా నిలిచాయి. ఇక మూడో టీ20 నవంబర్ 10న విదర్భ వేధికగా నాగ్ పూర్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన వారినే టీ20 టైటిల్ వరిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories