Rohit Sharma: విరాట్ లేకపోవటం లోటే.. అయినా సిరీస్ కైవసం చేసుకుంటాం

Rohit Sharma Press Meet With Media Hyderabad
x

Rohit Sharma: విరాట్ లేకపోవటం లోటే.. అయినా సిరీస్ కైవసం చేసుకుంటాం

Highlights

Rohit Sharma: ఇంగ్లండ్ జట్టులో బలమైన ఆటగాళ్లు ఉన్నారు.. వారిని తక్కువ అంచనా వేయలేం

Rohit Sharma: ఇంగ్లాండ్‌తో జరుగనున్న టెస్ట్ సిరీస్‌లో రాణిస్తామని, అద్భుతమైన ప్రదర్శనతో సిరీస్ కైవసం చేసుకుంటామని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు నెలలుగా తమ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారని, ఇంగ్లండ్ జట్టులో బలమైన ఆటగాళ్లు ఉన్నారు.. వారిని తక్కువ అంచనా వేయలేమని అన్నారు. అయినా తాము పక్కా వ్యూహంతో ఉప్పల్ మైదానంలోకి దిగుతామని, టెస్ట్ సిరీస్‌లో అనేక మార్పులు సంతరించుకున్నాయన్నారు. 20 ఏళ్ల కిందటి టెస్ట్ మ్యాచ్‌కి...

ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లకు చాలా వ్యత్యాసం ఉందన్నారాయన.. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరం అవడం లోటేనని రోహిత్ శర్మ అన్నారు. అయినా జట్టులో యువ ఆటగాళ్లు ఉన్నారని, సీనియర్లకు కూడా తలుపులు ముసుకు పోలేదన్నారు రోహిత్.. మూడో స్పిన్నర్‌గా అక్షర్, కుల్‎‌దీప్‌లలో ఎవరిని అదించాలన్నది తలనొప్పేనని, పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని అదించాలో నిర్ణయిస్తామని చెప్పారు. సిరాజ్ కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడని, తమ జట్టులో ఆయన ఒక కీలక బౌలర్ అని రోహిత్ కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories