ఆర్‌సీబీకి నాలుగో ఓటమి

ఆర్‌సీబీకి నాలుగో ఓటమి
x
Highlights

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఖాతాలో మరో ఓటమి నమోదయింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది....

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఖాతాలో మరో ఓటమి నమోదయింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. పార్థివ్‌ పటేల్‌ (67), మార్కస్‌ స్టొయినిస్‌ (31) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఆ తర్వాత రాజస్థాన్‌ 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. స్టీవ్‌ స్మిత్‌ (38), త్రిపాఠి (34 నాటౌట్‌) రాణించారు. చాహల్‌కు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా శ్రేయాస్‌ గోపాల్‌ నిలిచాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories