సెమీస్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు

సెమీస్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు
x
Highlights

సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ దిగ్గజ క్రీడాకారిణి పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక‍్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌...

సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ దిగ్గజ క్రీడాకారిణి పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక‍్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు 21-13, 17-21, 21-14 తేడాతో యాన్యాన్‌(చైనా)పై విజయం సాధించింది. దీంతో సెమీస్‌ కు అర్హత సాధించింది. తొలి గేమ్‌ను సింధు ఆడుతూపాడుతూ గెలవగా, రెండో గేమ్‌లో యాన్యాన్‌ పుంజుకోవడంతో రెండో గేమ్‌లో సింధుకు ఓటమి తప్పలేదు.

అయితే మూడో గేమ్‌లో మాత్రం సింధు తన జోరును కొనసాగించింది. వరుసగా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఇదే ఊపును కడవరకూ కొనసాగించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇక మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌ ఓటమి పాలైంది. సైనా నెహ్వాల్‌ 8-21, 13-21 తేడాతో ఒకుహరా(జపాన్‌) చేతిలో పరాజయం చవిచూసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories