ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు

ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు
x
Highlights

భారత స్టార్ బ్యాడ్మింటన్‌ ప్లేయర్ పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్‌ ఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో సింధు 21-19, 21-10 తో చైనా క్రీడాకారిణి...

భారత స్టార్ బ్యాడ్మింటన్‌ ప్లేయర్ పీవీ సింధు ఇండోనేషియా ఓపెన్‌ ఫైనల్‌కు చేరింది. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో సింధు 21-19, 21-10 తో చైనా క్రీడాకారిణి చెన్‌ యూఫీ పై వరుస గేముల్లో ఘన విజయం సాధించింది. ఈవిజయంతో భారత్‌కు కనీసం రజత పతకం ఖాయమైనట్లయింది. క్వార్టర్ ఫైనల్లో సింధూ నొజొమి ఒకుహరను చిత్తుగా ఓడించింది. సెమీఫైనల్లో తొలిగేమ్‌లో తడబడ్డ సింధు రెండో గేమ్‌లో దూకుడుగా ఆడి 21-10 తేడాతో గేమ్ తో పాటు మ్యాచ్ ను దక్కించుకుంది .. ఫైనల్లో ఆమె జపాన్ ప్లేయర్ అకానె యమగూచి తో తలపడనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories