
Team India : ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14ని ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం భారతదేశానికి ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. 2019...
Team India : ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14ని ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం భారతదేశానికి ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. 2019 సంవత్సరంలో ఇదే రోజున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగింది. పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగి నేటికి సరిగ్గా 6 సంవత్సరాలు. జైషే మహ్మద్ ఉగ్రవాది సీఆర్పీఎఫ్ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత భారత జట్టు అమరవీరులైన సిఆర్పిఎఫ్ సైనికులకు గౌరవాన్ని ప్రదర్శించింది.
ఈ దాడి జరిగిన కొద్ది రోజులకే టీం ఇండియా ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్లోని ఒక మ్యాచ్ రాంచీలోని JSCA అంతర్జాతీయ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు పుల్వామాలో అమరవీరులైన సైనికుల గౌరవార్థం ప్రత్యేక టోపీని ధరించింది. ఇది సైనిక టోపీ. అలా చేయడానికి ముందు BCCI ICC నుండి అనుమతి తీసుకుంది. మ్యాచ్ నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఐసీసీ కూడా నిర్ధారించింది. ఆ సమయంలో పుల్వామాలో అమరవీరులైన సైనికులను, వారి కుటుంబాలను గౌరవించటానికే ఈ టోపీ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
ఈ మ్యాచ్ ఫీజును కూడా భారత ఆటగాళ్ళు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో టీం ఇండియా జాతీయ రక్షణ నిధికి కోటి రూపాయలకు పైగా విరాళం ఇచ్చింది. అప్పట్లో టీం ఇండియా ఆటగాళ్లకు వన్డే మ్యాచ్ ఆడటానికి 8 లక్షల రూపాయలు, బెంచ్ మీద కూర్చున్న ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు ఇచ్చేవారు. టీం ఇండియా దాదాపు రూ.1.04 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని చొరవ తీసుకున్న తర్వాతే టీం ఇండియా సైనిక టోపీలు ధరించింది. టాస్ వేసే ముందు ధోని స్వయంగా కోహ్లీకి, మిగిలిన ఆటగాళ్లకు క్యాప్లను బహూకరించాడు. మరోవైపు, టాస్ సమయంలో విరాట్ కోహ్లీ, 'ఇది ఒక ప్రత్యేకమైన టోపీ' అని అన్నాడు. ‘‘పుల్వామా దాడిలో అమరవీరులకు, వారి కుటుంబాలకు నివాళి అర్పించడానికి ఇది. ఈ ప్రత్యేక ఆట నుండి వచ్చిన తమ మ్యాచ్ ఫీజును ఆటగాళ్లందరూ జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. జట్టు కెప్టెన్గా దేశంలోని ప్రతి ఒక్కరూ అలాగే చేయాలని, జాతీయ రక్షణ నిధికి వీలైనంత విరాళం ఇవ్వాలని, దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, పిల్లల విద్య, సంక్షేమానికి సహాయం చేయాలని నేను కోరుతున్నాను. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన క్యాప్, నిజంగా చాలా ప్రత్యేకమైన ఆట.' అని కోహ్లీ అన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




