IND vs PAK: ఈ సారి భారత్ చేతిలో పాక్ ఓడితే ఆ దేశంలో టీవీలు పగలకపోవచ్చు కారణం ఇదే ?

IND vs PAK: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ జరిగే సమయంలో టీవీలు పగిలిపోవడం సర్వ సాధారణం. కానీ ఈసారి భారతదేశం చేతిలో ఒక వేళ ఓడిపోతే పాకిస్తాన్ లో టీవీ సెట్లు పగలకపోవచ్చు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Feb 2025 12:22 PM IST
IND vs PAK: ఈ సారి భారత్ చేతిలో పాక్ ఓడితే ఆ దేశంలో టీవీలు పగలకపోవచ్చు కారణం ఇదే ?
X

IND vs PAK: ఈ సారి భారత్ చేతిలో పాక్ ఓడితే ఆ దేశంలో టీవీలు పగలకపోవచ్చు కారణం ఇదే ?

IND vs PAK: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ జరిగే సమయంలో టీవీలు పగిలిపోవడం సర్వ సాధారణం. కానీ ఈసారి భారతదేశం చేతిలో ఒక వేళ ఓడిపోతే పాకిస్తాన్ లో టీవీ సెట్లు పగలకపోవచ్చు. దీని వెనుక ఉన్న కారణాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఒకరు చెప్పారు. ఇప్పటివరకు భారతదేశం చేతిలో మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్‌లో టీవీలు పగిలిపోతుండేవి. 90వ దశకంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరిగేవి.. మారుతున్న కాలంతో ఇది స్వల్పంగా తగ్గింది. కానీ, ఈసారి భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్‌లో టీవీలు పగిలిపోవని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిల్ అలీ అన్నారు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది. దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డేల్లో భారత్‌కు 100 శాతం విజయాల రికార్డు ఉంది. ఈ అద్భుతమైన రికార్డు మధ్య పాకిస్తాన్ భారతదేశం చేతిలో ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, ఈసారి పాకిస్తాన్‌లో టీవీలు పగలవని బాసిల్ అలీ అన్నారు. ఇది జరగకపోవడానికి కారణం దేశం ఎదుర్కొంటున్న దుస్థితి. అక్కడ ప్రస్తుత పరిస్థితులేనని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, ఈసారి ప్రజలు టీవీలను పగలగొట్టరని బాసిత్ అలీ అన్నారు.

బాసిత్ అలీ 1993లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. అతను 19 టెస్టులు, 50 ODIలు ఆడాడు, 2 సెంచరీలతో 2000 పరుగులు చేశాడు. బాసిత్ అలీ తన ప్రకటనలతో వార్తల్లో నిలుస్తున్నాడు. అతను తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నడుపుతున్నాడు. భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లకు వారి స్వంత అభిప్రాయాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. భారత్ పాకిస్తాన్‌ను దారుణంగా ఓడిస్తుందని అన్నాడు. కాగా, దుబాయ్‌లో భారత్‌పై పాకిస్థాన్‌నే ఫేవరెట్ అని మహ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ కు అతీతమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఇది ఒక పెద్ద ఈవెంట్ అని, ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేమని ఆయన అన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story