
India vs Pakistan : హ్యాండ్షేక్ వివాదం నుంచి బయటపడని పాక్.. మరోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు
India vs Pakistan : ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ జట్టు వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. హ్యాండ్షేక్ వివాదం తర్వాత, పాకిస్తాన్ మరోసారి తమ వైఖరిని స్పష్టం చేసింది.
India vs Pakistan: ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ జట్టు వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. హ్యాండ్షేక్ వివాదం తర్వాత, పాకిస్తాన్ మరోసారి తమ వైఖరిని స్పష్టం చేసింది. టీమిండియాతో జరిగే సూపర్-4 మ్యాచ్కు ముందు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ను రద్దు చేశారు. అలాగే, తమ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఒక మోటివేషనల్ స్పీకర్ సహాయం తీసుకుంటున్నారు. ఈ విషయాలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.
ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు వ్యవహారాలు నిరంతరంగా వివాదాస్పదంగా మారుతున్నాయి. యూఏఈతో జరిగిన మ్యాచ్కు ముందు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ను రద్దు చేసిన పాకిస్తాన్, ఇప్పుడు భారత్తో జరిగే సూపర్-4 మ్యాచ్కు ముందు కూడా అదే పని చేసింది. తమ జట్టు ఆటగాళ్లలో విశ్వాసం నింపడానికి ఒక మోటివేషనల్ స్పీకర్ను ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు రద్దు?
ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ రెండోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ను రద్దు చేసింది. దీనికి గల కారణాలు స్పష్టంగా వెల్లడించలేదు. అయితే, గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ జట్టులో ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. అందుకే, ఆటగాళ్లకు మానసిక స్థైర్యం కల్పించడానికి డాక్టర్ రాహీల్ అనే మోటివేషనల్ స్పీకర్ను పిలిచినట్లు సమాచారం.
హ్యాండ్షేక్ వివాదం.. ఇంకా కోపంగానే ఉంది
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా భారత జట్టు పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత హ్యాండ్షేక్ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం పాకిస్తాన్ జట్టుకు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా స్పందించింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై కూడా భారత్ వైపు ఉన్నారని ఆరోపణలు చేసింది.
తమ డిమాండ్లు నెరవేర్చకపోతే టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని కూడా పీసీబీ బెదిరించింది. అయితే, పైక్రాఫ్ట్తో జరిగిన సమావేశం తర్వాత వారు ఆడటానికి అంగీకరించారు. ఈ వివాదం అక్కడితో ఆగలేదు. ఐసీసీ పీసీబీకి ఒక గట్టి మెయిల్ పంపించింది. ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్లో కాకుండా, మ్యాచ్ అఫీషియల్స్ ఏరియాలో పైక్రాఫ్ట్తో జరిగిన సమావేశాన్ని రికార్డ్ చేసి ఆన్లైన్లో ఉంచడం ప్రోటోకాల్కు విరుద్ధం అని ఐసీసీ స్పష్టం చేసింది.
పాకిస్తాన్ జట్టుపై తీవ్ర ఒత్తిడి
మైదానం వెలుపల జరుగుతున్న ఈ నాటకీయ పరిణామాలు పాకిస్తాన్ జట్టుపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. సల్మాన్ ఆఘా నాయకత్వంలోని జట్టు భారత్తో జరిగే సూపర్-4 మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఈ ఒత్తిడిలో వారు ఎలా ఆడుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్కు కూడా ఆండీ పైక్రాఫ్టే మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




